1, మార్చి 2011, మంగళవారం

శివరాత్రి శుభాకాంక్షలు



శివాష్టకం
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం |
జగన్నాథనాథం సదానందభాజం |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 1

గళే దండమాలం తనౌ సర్పజాలం |
మహాకాలకాలం గణేశాదిపాలం |
జటాజూటగంగోత్తరంగై ర్విశాలం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 2

ముదా మాకరం మండనం మండయంతం |
మహామండలం భస్మభూషాధరం తమ్‌ |
అనాదిం హ్యపారం మహామోహమారం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 3

వటాధోనివాసం మహాట్టాట్టహాసం |
మహాపాపనాశం సదా సుప్రకాశమ్‌ |
గిరీశం గణేశం సురేశం మహేశం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 4

గిరీంద్రాత్మజాసంగృహీతార్ధదేహమ్‌ |
గిరౌ సంస్థితం సర్పహారం సురేశం |
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 5

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం |
పదాంభోజనమ్రాయ కామం దదానం |
బలీవర్దయానం సురాణాం ప్రదానం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 6

శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం |
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్‌ |
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 7

హరం సర్పహారం చితాభూవిహారం |
భవం వేదసారం సదా నిర్వికారం |
శ్మశానే వసంతం మనోజం దహంతం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 8

స్తవం యః ప్రభాతే నర శ్శూలపాణేః |
పఠేత్‌ సర్వదా భర్గసేవానురక్తః |
స పుత్రం ధనం ధాన్యమిత్రే కళత్రం |
శివం శంకరం శంభు మీశాన మీడే|10

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

వినాయక చవితి వేడుకలను జరుపుకుందాం

భాద్రపద శుద్ధ చవితినాడు మనం వినాయక చవితి వేడుకలను జరుపుకుంటాం. అయితే, అసలు చవితినాడు పండుగ ఎందుకు చేసుకుంటాం? ఆ రోజు వినాయకుడు గణాలకు నాధుడిగా నియమించబడ్డాడు. కనుక ఆ రోజు హిందూవులకు అతి పవిత్రమైన రోజు. విఘ్నేశ్వరుని పూజించి సేవిస్తారు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది...! సూర్యోదయానికి ముందు తూర్పున ఏ నక్షత్రాలు ఉదయిస్తాయో ఆ నక్షత్రాలకు సంబంధించిన దేవుడి పండుగ జరుపుకోవాలనేది రుగ్వేదంలోని నియమం. కనుక భాద్రపద శుద్ధ చవితినాడు సూర్యోదయానికి ముందు తూర్పున వినాయక నక్షత్రాలు ఉదయిస్తాయి. కాబట్టి ఆ రోజు వినాయక చవితిగా భారత దేశంలోని హిందూవులు వేడుకలు జరుపుకుంటారు. అలాగే, గ్రహాల్లోకెల్లా ముఖ్యమైన గ్రహం శనిగ్రహం. శనీశ్వరుడి ప్రభావం మనకు తెలిసిందే. సకల దేవతలూ భయపడే శనీశ్వరుడు స్వయం రక్షణ కోసం వినాయక కవచాన్ని ధరిస్తాడట. వినాయకుని మహత్యం ఇంతా అంతా మరి...!
పార్వతీ పరమేశ్వరుల కుమారులు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి పెరిగి పెద్దవారయ్యారు. తన తర్వాత గణాలకు అధిపతిని నియమించే సమయం ఆసన్నమైందని ఈశ్వరుడు తలిచాడు. ఆ సమయంలో నేనే పెద్ద! అంటూ కుమారస్వామి అన్నగారిని తక్కువ చేసి మాట్లాడాడు. ఏనుగు తొండం ఉన్నవాడు అధిపతి ఎలా అవుతాడని ప్రశ్నించాడు. దీంతో కైలాసనాథుడు ఇద్దరు కుమారుల మధ్య ఓ పోటీ పెట్టాడు. భూలోకంలోని సమస్త పుణ్యతీర్థాలలో ముందుగా స్నానమాచరించి ఎవరు కైలాసానికి చేరుకుంటారో వారికే పట్టం కడతానని మహేశుడు చెప్పాడు. దీంతో వాయువేగంతో నెమలి వాహనంపై కుమారస్వామి బయలుదేరి వెళ్లాడు. తన మూషిక వాహనంపై వెళ్లి ఎలా విజయం సాధించగలనని విఘ్నేశ్వరుడు చింతాక్రాంతుడయ్యాడు. తల్లిదండ్రులే దైవమని భావించి వారి చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేయసాగాడు. అచట స్నానానికి వెళ్లిన కుమారస్వామికి అన్నయ్య స్నానం పూర్తి చేసుకుని ఎదురు రావడం కనిపించింది. దీనితో అన్నగారి మహత్యం తెలుసుకున్న కుమారస్వామి వినాయకుడే పట్టానికి అర్హుడని భక్తితో తండ్రికి తెలిపాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు శివుడు గణాలకు నాయకుడిగా విఘ్నేశ్వరుని నియమించాడు. అప్పటినుంచీ ఆయనకు గణనాధుడు, గణేశుడు అని పేర్లు వచ్చాయి.

శుభాలు కలిగించే పత్రాల పూజ...!

వినాయక చవితి నాడు చేసే పూజలో కీలకమైనది 21 ప్రతాలతో చేసే పూజ. ఈ పూజ చేయడం ద్వారా కష్టాలు తొలగిపోయి అషై్టశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ పూజలో ముఖ్యమైనది గరిక. గరిక అంటే స్వామి వారికి ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. దీనిని దూర్వా పత్రమని అంటారు. ఇందులో తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలు ఉంటాయి. తర్వాతది మాచీపత్రం అంటే చేమంతి జాతికి చెందిన ఆకులు. ఈ ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. తర్వాతి పత్రం అపామార్గ పత్రాలు. ఇవి గుండ్రంగా ఉంటాయి. దీనినే తెలుగులో ఉత్తరేణి అని అంటారు. వీటితో పాటు బృహతీ పత్రం, దీన్నే ములక అని అంటారు. వీటిలో చిన్న ములక, పెద్ద ములకలు అని రెండు రకాలు ఉన్నాయి. దుత్తూర పత్రం, అంటే ఉమ్మెత్త ఆకులు. వంకాయ జాతికి చెందిన చెట్లు ఇవి. తులసీ పత్రం, ఈ పత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పేదీ ఏమీ లేదు. దేవతార్చనలో వాడే ఈ పత్రాలు మంగళదాయకమైనవి. శమీపత్రం, జమ్మిచెట్టు ఆకులను శమీపత్రాలు అంటారు. దసరా సమయంలో ఈ చెట్టుకు భక్తులు విశిష్ట పూజలు నిర్వహిస్తారు. మరువక పత్రం, వీటినే ధవనం, మరువం అని కూడా అంటారు. పూల మాలల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. కరవీర పత్రం, ఈ పత్రాలను గన్నేరు పత్రాలని కూడా అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు ఇలా వివిధ రంగుల్లో ఈ పూలు ఉంటాయి. బిల్వ పత్రం, ఈ పత్రాలను మారెడు దళాలని అంటారు. మూడు ఆకులు కలిసి ఉండే దీనిని దళం అంటారు. వీటితో శివుడిని పూజిస్తే చాలా మంచిది. చూత పత్రం, ఇవే మామిడి ఆకులు. బదరీ పత్రం, బదరీ అంటే రేగాకులు. రేగి కాయ చెట్టుకు ఉండే ఆకులు ఇవి. వీటిలో రేగు, జిట్రేగు, గంగిరేగు అని మూడు రకాలు ఉంటాయి. గుండ్రంగా ఉండే ఆకులను పూజకు ఉపయోగించాలి. విష్ణుక్రాంత పత్రం, తెలుపు, నీలం రంగు పులుండే చెట్లు ఇవి. నీలం రంగు పులు ఉండే చెట్టును విష్ణుక్రాంత చెట్టుగా పిలుస్తారు.
సింధువార పత్రం, దీన్నే వావిలి అని కూడా పిలుస్తుంటారు. అశ్వత్థ పత్రం, ఇవే రావి ఆకులు. దాడిమీ పత్రం దాడిమీ అంటే దానిమ్మ. దానిమ్మ ఆకులతో విఘ్నేశ్వరుని పూజిస్తారు. జాజి పత్రం, ఇవి మల్లి జాతికి చెందిన ఓ రకమైన మొక్కలు. అర్క పత్రం, ఇవే జిల్లేడు ఆకులు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. తెల్ల జిల్లేడు, పచ్చ జిల్లేడు. వీటిలో ఏవైనా పూజకు శ్రేష్టమైనవే. అర్జున పత్రం, మద్దిచెట్టు ఆకులను అర్జున పత్రం అంటారు. మర్రి ఆకుల వలె ఇవి ఉంటాయి. దేవదారు పత్రం, దేవతలకు ఈ పత్రం అంటే చాలా ఇష్టం. ఇవి సన్నగా గడ్డిలా ఉంటాయి. గండలీ పత్రం, దీనినే లతాదూర్వా అని కూడా అంటారు. భూమిపైన తీగలాగా ఆ చెట్టు పెరుగుతుంది.

20, జనవరి 2010, బుధవారం

రీడ్‌ మరాఠీ... రైట్‌ మరాఠీ...! తెలుగు వ్యుత్పత్తి పదకోశాలు

ట్యాక్సీ డ్రైవర్‌ కావాలంటే తప్పనిసరి.ఇకపై ముంబైలో ట్యాక్సీ నడపాలంటే ముఖ్యంగా మూడు అర్హతలు ఉండాలి. ఒకటి... మరాఠీ మాట్లాడటం. రెండు... మరాఠీ చదవడం, రాయడం. మూ డు... కనీసం 15 సంవత్సరాలుగా స్థానికులై ఉండటం.ఈ అర్హతలు ఉంటేనే ట్యాక్సీ పర్మిట్‌ జారీ చేస్తారు.సీఎం అశోక్‌ చవాన్‌ నేతృత్వంలో సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ముంబైలోని 'వలస' రాజకీయాలను కొత్త మలుపు తిప్పనుంది.నగరంలో సుమారు 2 లక్షలకు పైగా ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు.(ఆంధ్రజ్యోతి21.1.2010)

మనరాజధాని నగరంలో కూడా ఇలా చేస్తే బాగుండును.తెలుగు మీడియంలో చదువుకున్నవారికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి.తెలుగులో చదవండి,తెలుగులో వ్రాయండి.
అవును మరి. తెలుగు ని ఆంగ్లం లో మాట్లాడే ఈ నాటి యువత కూడా అస్సలుతెలుగుని తెలుగులో నే మాట్లాడాలని కూడా చెప్పాలి. అమ్మని అమ్మా అని, నాన్నని నాన్న , నాన్నగారు ,బాపూ అని పిలవాలని ఎవరూ చెప్పక్కర్లేదనుకుంటా. ముందు తెలుగు లో మాట్లాడడానికి సిగ్గుపడ్డం మానేయాలి. మన భాష ని ఎక్కడ ఉన్నా ప్రేమించి మాట్లాడ్డం నేర్చుకోవాలి. మనల్ని మనమే గౌరవిన్చుకోకుండా ఎవరో చులకన చేసారని భావించడం సబబా / తెలుగు మాట్లాడదాం /తెలుగులో పలకరించుకుందాం /తెలుగు భాషకి జీవం పోద్దాం

26, ఆగస్టు 2009, బుధవారం

రైతుస్వేచ్ఛ హరించే ప్రయత్నమే సహకార వ్యవసాయ విధానం

ప్రకృతి సమస్త జీవరాశికి కావలసిన ఆహారాన్ని అందిస్తున్నది. మానవుడు ప్రకృతిపై ఆధారపడుచూ తన జీవనాధారం కొరకు వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు. వ్యవసాయంలో భూమి అనేది ప్రధానంగం. మానవుడు తన మేథోసంపత్తితో వివిధ రంగాలలో ప్రవేశించిన వ్యవసాయం తన మనుగడకు తప్పనిసరి అయినది. అనాధి నుండి చేస్తున్న అట్టి వ్యవసాయం నేడు భారమైనది. అష్టకష్టాల కోర్చి పండించిన పంటకు సరైన ధర అందటం లేదు. ఇతర పనులు చేసే అవకాశం లేక తప్పనిసిరై రైతు వ్యవసాయం చేస్తున్నాడని సత్యాన్ని ప్రభుత్వ నివేదికలు కూడా తెలుపుచున్నాయి. మానవాళి మనుగడకు వ్యవసాయ వృత్తి కొనసాగించడం అనివార్యం ఇలాంటి అతిముఖ్యవృత్తికి ప్రభుత్వాల నుండి సరియైన ప్రోత్సాహం లేక ప్రకృతిని నమ్ముకొని రైతు తాను బ్రతుకుచు మిగతా సమాజానికి ఆహారాన్ని అందిస్తున్నాడు. వ్యవసాయ సమస్యలు కొన్ని దైవనిర్ణయానికి, ప్రకృతి నియమావళిపై ఆధారపడగా, చాలా సమస్యలు పాలకుల లోపభూయిష్టమైన విధానాల వల్ల ఏర్పడుచున్నవి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, భూసార పరిరక్షణ సరైన సమయంలో రుణాలు, నీరు, విద్యుత్‌ సరఫరా గిట్టుబాటుధరలు తదితర సమస్యల పరిష్కారం పాలకుల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. తమ పరిధిలోని వ్యవసాయ సమస్యల పరిష్కారం ఆలోచించుటకు బదులుగా రైతుస్వేచ్ఛ, సంపదను, ఉపాధిని హరించే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నమే సహకార వ్యవసాయ విధానం.
రైతులు ఆత్మహత్యలు అరికట్టుటకు తగిన సలహా, సూచనల నిమిత్తమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్‌, జయతిఘోష్‌, రామచెన్నారెడ్డిల నేతృత్వంలో వివిధ వేరువేరు కమిటీలను నియామకం చేసింది. ఆ కమిటీలు వ్యవసాయ రంగాభివృద్ధి, అధికోత్పత్తి, రైతు శ్రేయస్సు గూర్చి తమ నివేదికలను ప్రభుత్వాలకు అందజేసినారు. ఆ నివేదికలో సూచించిన అంశాలను అమలుపరచకుండా, సహకార వ్యవసాయ విధానం అనే కొత్త ఆలోచనతో రావడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించక తప్పదు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్యలను అరికట్టడం చేతగాక, రైతాంగం సమస్యల పరిష్కారంలో విఫలమై ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే సహకార వ్యవసాయ విధానం.
ప్రతిపాదిత సహాకర సేద్యంలో గ్రామములో రైతులంతా వారికివారే భూములను సహకార సంస్థలకు అప్పగించడం ద్వారా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అనేది ప్రభుత్వ అభిప్రాయం. భూమి అనేది రైతుకు జీవనోపాధితోపాటు సామాజిక, ఆర్థికస్థితికి కారణంగా భావిస్తాడు. తరతరాలుగా ఈ సమాజం భూమిని కల్గి ఉండడం ఒక హోదాగా భావిస్తున్నది. భూమికి రైతుకు మనిషికి పేగుకు ఉన్న సంబంధంలాంటింది. అలాంటి బంధాన్ని రైతు సామాజిక, ఆర్థిక హోదాకు ఫణంగా పెట్టి ఏ రైతు తన భూమిని సహకార సంస్థకు స్వాధీనపరచుటకు ఒప్పుకోడు. ప్రభుత్వ ప్రకటనకు రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామము ముందుకు రాకపోవడం గమనార్హం. రైతు భూమిని స్వాధీనపరచుకుని అతని సామాజిక హోదాను రైతు నుండి కూలీగా మార్చే ప్రయత్నమే ఈ ప్రతిపాదన. రైతుభూమిని స్వాధీన పరచుకుని ఆ భూమి విలువకు సమాన షేర్స్‌ ఇస్తానంటున్నారు. భూమి విలువ ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు. అందులోని ప్రభుత్వ అవినీతి, అలసత్వత, ఆశ్రిత పక్షపాతం కారణంగా రైతు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే భూమిలేనివారికి కూడా షేర్స్‌ ఇస్తాననటం ద్వారా అధిక డబ్బున్న కంపెనీలు షేర్స్‌ కొనుగోలు చేసి సంస్థ ఆధిపత్యం కొనసాగించుకొని రైతును చిన్నచూపు చూసే అవకాశం ఉంది. అలాగే రైతు తన కుటుంబ అవసరాలను వివిధ రకాల పంటలను, పశుపోషణచేసుకుంటు వస్తున్నాడు. ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం సంవత్సరానికి ఒకసారి ఇచ్చే డబ్బులో రైతు తన పిల్లల చదువు, శుభకార్యాలు, రోజువారి ఖర్చులుఎలా తీర్చుకోగలుగుతాడో ప్రభుత్వాల విధానంలో స్పష్టత లేదు. గ్రామములోని రైతులందరికీ రోజు పనికల్పించడం సంస్థకు సాధ్యమని గ్రామములోని రైతు కూలీలకు పని కల్పించబడుతుందా? చేతివృత్తులు, వ్యవసాయ అనుబంధం గలిగిన పశుపోషణ, డైరీ, పౌల్ట్రీ, మిల్లింగ్‌, కులవృత్తులు వారి జీవనోపాధికి ముప్పు ఏర్పడదా? ఇప్పుడున్న గ్రామీణ జీవన విధానంలో వివిధ కులస్థులు, వృత్తుల వారు ఒకరికి ఒకరు సహకారిగా ఉంటూ కష్టసుఖాలలో పాలుపంచుకుంటారు. గ్రామమంతయు మొత్తం ఒక సంస్థ స్వాధీనంలోకి పోయిన పిదప ఆర్ధిక కోణం తప్ప సామాజిక భావన తగ్గి పేదల ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. గ్రామాలలో ఉండే ఆప్యాయత, అనురాగాలు దెబ్బతి, గ్రామీణ జీవనమే అస్తవ్యస్తమవుతుంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణం మెరుగు పర్చుటకు బదులుగా వారిని బానిసబ్రతుకులుగా మార్చే ప్రయత్నమే ఇది?
చిన్నచిన్న కమతాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనుటకు రైతుకు శక్తి చాలుద. చిన్న కమతాల వలన దిగుబడి తక్కువ, యాంత్రీకరణకు చిన్న కమతాలు ఆటంకం రైతు ఆదాయం పెంచే ప్రయత్నానికి చిన్న కమతాల అడ్డంకి. మార్కెట్‌ పరిజ్ఞానము, ధాన్యం మార్పిడి, గోదాములలో దాచుకోవడం వంటి సహాయ చర్యలను చిన్న రైతులు అవగాహన చేసుకోలేకపోతున్నారు. తద్వార వారి ఆదాయం పెరగటం లేదు. సహకార సంస్థ కంపెనీ ద్వారా మార్కెట్‌ చిన్న రైతులను ఒడ్డుకు చేర్చేందుకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్పుటకు మార్కెట్లో రైతులకు అనుసంధాన ప్రక్రియకు వీలుకలుగుతుందనే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం సత్యదూరం. మన రాష్ట్రంలోగాని, దేశంలోగాని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుభవం ప్రకారం చిన్న కారువారే, కాని వారి అధీనంలో ఉన్న భూమి 33శాతం మాత్రమే అట్టి 33 శాతం భూమిలోనే రాష్ట్రంలో సగం వ్యవసాయ ఉత్పత్తులను పండించుచున్నారు. మన దేశంలోనే కాకుండా చైనా, ఈజిప్ట్‌, వియత్నాం లాంటి దేశాలలో అధిక శౄతం చిన్న కమతాలైనపపటికిని వాటి సరాసరి ఉత్పత్తి పెద్ద కమతాలున్న యూరప్‌, అమెరికా కంటే ఎక్కువ సన్న చిన్నకారు రైతులు తాను తన కుటుంబ సభ్యులు రేయనక, పగలనక కష్టపడి ప్రత్యేక శ్రద్ధతో అధిక ఉత్పత్తి సాధించుచున్నారు. అందుకే ఈ రోజు పెద్ద కమతాలున్న రైతులు సైతం చిన్నరైతులకే కౌలు ఇవ్వటం గమనార్హం. రైతుకు కావలసిన మౌలిక సదుపాయాలకల్పనపై దృష్టి సారించకుండా ప్రభుత్వతం వితండవాదం చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెటింగ్‌ వ్యవస్థను రాజకీయ ప్రమేయంతో నిర్వీర్యం చేసింది. రైతు తన ఉత్పత్తులను నిల్వ చేసుకొనుటకు గోదాములే లేవు. ఉన్న గోదాములు సైతం వ్యాపారస్తుల కొనుగోళ్ళ నిల్వకే ఉపయోగపడుచున్నవి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించుటకు యాత్రీకరణకు ప్రభుత్వ ప్రయత్నమేలేదు. తన చేతిలో ఉన్న పనిని చేయని ప్రభుత్వం మరొకరి ద్వారా పనులు చేయిస్తాననటం ఎంతవరకు విశ్వసించవచ్చు. చిన్న సన్నకారు రైతుల భూమిని లాక్కొని వారిని కూలీలుగా మార్చి, వారి స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛను, స్వాభిమానాన్ని, జీవనోపాధిని చేపట్టే చర్యే ఈ సహకార సేద్యం లక్ష్యం.
ప్రభుత్వం యాంత్రీకరణ గూర్చి సహకార సేద్యంలో సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉన్న సేద్యంతో సాధ్యపడదు అనే వాదన ఖండించదగినది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రకాల యంత్రాలను రైతులు ఉపయోగించుకుంటున్నారు. కాని అట్టి యంత్రాలు అధిక ధరలతో అందుబాటులో లేని కారణంగా విరివిగా ఉపయోగించుకోలేని స్థితి ఉంది. యంత్రాలపై పన్నులు, సుంకాలను పెంచిన ప్రభుత్వం యాంత్రీకరణ గూర్చి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఆగ్రోస్‌ లాంటి సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే. యాంత్రీకరణ ద్వారా అధిక ఉత్పత్తి సాధించవచ్చనేది పచ్చి అబద్ధం ఇలాంటి అసత్యపు వాదనతో రైతులను మభ్య పెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నష్టపరిచే చర్యగా భావిస్తున్నాము.
ప్రభుత్వం ప్రతిపాదిత సహకార సేద్యం రైతులకు లాభం కంటే నష్టం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతిపక్షాలు, రైతు నాయకులు, రైతులు వివిధ రంగాలకు సంబంధించిన నిపుణుల సూచనలను విస్మరించి తొందరపాటుతో సహకార సేద్యానికి పూనుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా సమిష్టి వ్యవసాయ విధానం విజయవంతం కాలేదు. పూర్వపు సోవియట్‌ రష్యాలో ప్రభుత్వం ఆధీనంలోని వ్యవసాయ విధానంలో ఉత్పత్తి తగ్గి ఆహారకొరత ఏర్పడిన కారణంగా ఆ విధానానికి స్వస్తి పలికినది. చైనా సైతం 1978తదుపరి రైతు భూమిపై వ్యక్తిగత యాజమాన్య హక్కు కల్పించి ఉత్పత్తిపై లాభాన్ని చూపిన తదుపరి బ్రహ్మాండమైన పురోగతిని సాధించింది. 1950వ దశకంలో అప్పటి ప్రధాని జవహార్‌లాల్‌నెహ్రుగారు ప్రవేశపెట్టిన సహాకర వ్యవసాయ బిల్లును రైతు నాయకులు వ్యతిరేకించినప్పటికీ బలవంతంగా ఆమోదింపచేసిన ఆ ప్రయోగం ప్రయోజనం లేకుండా పోయింది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన ఇజ్రాయిల్‌ విధానం అక్కడి రైతులకు లాభంకంటే ఎక్కువ నష్టాలను చవిచూపింది. మన రాష్ట్రంలో నష్టాలపాలైన చక్కెర, డైయిరీ, సహకార బ్యాంకుల అనుభవాల నుండి గుణపాఠం నేర్చుకోకుండా ఈ సహకార సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం రైతు వ్యతిరేక చర్య రాష్ట్రంలోని సహాకార బ్యాంకుల వైఫల్యాలను గమనించవలసిన అవసరం ఉంది. సహాకార సంఘాలు రైతులకు లాభం చేకూర్చకపోగా వారి వాటా ధనాన్ని కూడా ఇవ్వకపోవడం గమనార్హం. రాజకీయ జోక్యం, అవినీతి, సహకార స్ఫూర్తి కొరవడడం ఈ సంస్థల వైఫల్యానికి ప్రధాన కారణాలు అని నిపుణుల సూచనలు విస్మరించి మరో ప్రయోగానికి పాటుపడటం రాజకీయ

30, జులై 2009, గురువారం

ఎస్సీ ఉపప్రణాళికా నిధుల కేటాయింపులు

ఎస్సీ ఉపప్రణాళికా నిధుల కేటాయింపులు (రూ. కోట్లలో)

సంవత్సరం----మొత్తం ప్రణాళికా వ్యయం-- ఎస్సీ,ఎస్టీ కేటాయింపులు---శాతం
2002-03---8553.19------------903.91------------10.56
2003-04--10970.45-----------1113.19------------10.14
2004-05--13291.20-----------1181.03------------8.89
2005-06--15650.77-----------1445.35-----------9.24
2006-07--2000.00------------1730.40----------8.85

27, జూన్ 2009, శనివారం

పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ ఇక లేరు...

11111111111


పాప్‌ రారాజు మైఖేల్‌ జాక్సన్‌ ఇక లేరు
లాస్‌ఏంజెల్స్‌ : పాప్‌ సంగీత సామ్రాజ్యానికి రారాజు, ప్రపంచంలోనే అతి పెద్ద సెలబ్రిటి మైఖేల్‌ జాక్సన్‌(50) ఇక లేరు. గుండెపోటుతో మరణించారు. హాంబీ హిల్స్‌లోని జాక్సన్‌ అద్దె ఇంటి దగ్గర దాదాపు ముప్పావుగంటపాటు ఆయనకు చికిత్స చేసిన వైద్యులు తప్పనిసరి పరిస్థితిలో హుటాహుటిన యుసిఎల్‌ఎ మెడికల్‌ సెంటర్‌కు తరలించారు. డాక్టర్లు ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. పాప్‌ సంగీత అభిమానులకు విషాదాన్ని మిగిల్చి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు మైఖేల్‌ జాక్సన్‌. ‘జాక్సన్‌ ఇంటివద్దే గుండెపోటుకు గురయ్యాడు. కానీ, అటాప్సీ ఫలితం వచ్చే వరకూ ఆయన చావుకు కారణాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాం’ అని సోదరుడు జరె్మైన్‌ తెలియజేశారు. ‘ఇంట్లోనే ఆయన మరణించి ఉంటాడనిపిస్తోంది’ అని ఉద్వేగానికి లోనైన జాక్సన్‌ సోదరుడు జెరె్మైన్‌ విలేకరులకు చెప్పారు. ‘మధ్యాహ్నం దాదాపు ఒకటింబావుకు జాక్సన్‌ను ఆస్పత్రికి తీసుకురాగానే ఎమర్జెన్సీ డాక్టర్లతో సహా వైద్య బృందం, కార్డియాలజిస్టులు ఆయనను బతికించేందుకు గంటకు పైగా శాయాశక్తులా ప్రయత్నించారు’ అని జెరె్మైన్‌ చెప్పారు. విలేకరుల ప్రశ్నలకు ఆయన జవాబివ్వకుండా ‘అల్లా జాక్సన్‌ వెంట ఉండాలి, మైఖేల్‌ ఎప్పుడూ ఉంటాడు’ అని చెప్పి వెళ్లిపోయారు. లాస్‌ ఏంజిల్స్‌ కౌంటీలో మరణాలపై పరీక్షలు జరిపే ఫ్రెడ్‌ కొర్రాల్‌ మధ్యాహ్నం 2.14 గంటలకు జాక్సన్‌ మరణాన్ని ధ్రువీకరించారు. సుదీర్ఘ విరామం అనంతరం లండన్‌లో తిరిగి 50 షోలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో జాక్సన్‌ను మృత్యువు ఎగరేసుకుపోయింది. వచ్చే నెల 13వ తేదీన జాక్సన్‌ తొలి ప్రదర్శనపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో మైఖేల్‌ జాక్సన్‌ మృతి వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మైఖేల్‌ జాక్సన్‌ మరణ వార్త తెలిసిన వెంటనే ఎంటీవీ మిగతా కార్యక్రమాలన్నింటినీ నిలిపివేసి జాక్సన్‌ వీడియోలను ప్రసారం చేయడం ప్రారంభించింది. రేడియో స్టేషన్లు ప్రజాదరణ పొందిన మైఖేల్‌జాక్సన్‌ పాటలను ప్రసారం చేశాయి. ఆసుపత్రి వెలుపల వందలాదిమంది గుమిగూడారు. మైఖేల్‌ మరణించాడని స్క్రీన్‌ మీద ప్రసారం చేసిన న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్దకు జనం తండోపతండాలుగా వచ్చారు. ఎక్కడ చూసినా ఈ వార్తను సెల్‌ఫోన్‌ల ద్వారా తమ స్నేహితులు, బంధువులకు తెలియజేసేవారే కనిపించారు. మైఖైల్‌ జాక్సన్‌ తయారుచేసిన ఒక్కొక్క ఆల్బమ్‌ ఒక్కో సంచలనం అయితే, 1982లో విడుదలైన ‘థ్రిల్లర్‌’ అన్నిటికంటే ఎక్కువగా పాప్‌ సంగీతంలో పెను కంపనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఆల్బమ్‌ ప్రపంచవ్యాప్తంగా 500 లక్షల కాపీలు అమ్ముడుపోయి ఆల్‌ టైమ్‌ రి కార్డును సృష్టించింది. ‘మైఖేల్‌ జాక్సన్‌ చిన్న వయస్సులోనే ఆకస్మికంగా మననుంచి దూరమయ్యా డు. నాకు మాటలు రావడం లేదు. ఆయన అందిం చిన వినోదం, సంగీతం ప్రపంచం లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. నేను నా సోదరుడిని కోల్పోయాను. నా ఆత్మను తనతో తీసుకెళ్ళిపోయాడు’ అని జాక్సన్‌ రూపొందించిన థ్రిల్లర్‌ ఆల్బమ్‌ నిర్మాత క్విన్స్‌సీ జోన్స్‌ తన విచారాన్ని వ్యక్తం చేశాడు. పేదరికం కారణంగా బాల్యం నుంచీ కష్టాలను అనుభవించిన మైఖేల్‌జాక్సన్‌ తనదైన శైలితో పాప్‌ సంగీతంలో తిరుగులేని ఖ్యాతిని సంపాదించాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఎంతటి పేరు ప్రతిష్టలను సంపాదించాడో అన్ని విమర్శలకు గురయ్యాడు. సంగీత సంచలనాలకు మారుపేరుగా నిలిచిన జాక్సన్‌ వివాదాలకూ కేంద్రబిందువయ్యాడు. నాలుగేళ్ళ వయస్సులోనే గళాన్ని విప్పిన, అనంతరం సోదరులతో కలిసి స్టేజ్‌ షోలు చేసిన జాక్సన్‌ టీనేజ్‌ వయస్సులోనే తనకంటూ ప్రత్యేకతను తెచ్చిపెట్టుకున్నాడు. ఈ వయస్సులోనే అత్యంత ప్రజాదరణ పొందిన గాయకుడిగా మారాడు. ‘ఐ వాంట్‌యు బాక్‌, ఎబిసి, ఐ విల్‌ బి దేర్‌’ మైఖేల్‌ జాక్సన్‌ కెరీర్‌ తొలినాళ్ళల్లో నెం.1 హిట్‌లుగా చెప్పచ్చు. ఒక చేతికి గ్లోవ్‌, బిగుతైన మిలటరీ తరహా జాకెట్‌, ఏవియేటర్‌ కళ్ళద్దాలు మైఖేల్‌ జాక్సన్‌కే సొంతమైన ఆహార్యం. పాప్‌ సంగీతంలో జాక్సన్‌ ఎదిగేనాటికి ఉన్న ప్రజాదరణ ఉన్న వ్యక్తులు ఎల్విస్‌ ప్రెస్‌లే, బీటిల్స్‌. అప్పట్లో వీరితో సమానంగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు, ప్రెస్లే కుమార్తె లీసా మేరీని జాక్సన్‌ వివాహం చేసుకున్నాడు. 1980వ దశకంలో ముఖ్యంగా 1983లో పాప్‌ సంగీత ప్రపంచాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన మైఖేల్‌ జాక్సన్‌ కెరీర్‌ 1993 నుంచి క్షీణించడం ప్రారంభించింది. బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు, అనంతర కాలంలో 2002లో పసికందు ప్రిన్స్‌ మైఖేల్‌ 2 వివాదం తదితర పరిణామాలన్నీ జాక్సన్‌ కెరీర్‌ను దెబ్బతీశాయి. ఆయనను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి.
జాక్సన్‌ జీవితంలో అవస్వరాలు1984 : పెప్సీ- కోలా వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో పేలుడుజరిగిన జాక్సన్‌ తలపైభాగం కాలిపోయింది.2002 : బెర్లిన్‌లోని ఓ హోటల్‌లో జాక్సన్‌ తన కొడుకు ప్రిన్స్‌ మైఖేల్‌ 2తో ఆటలాడుతూ ఉన్నట్టుండి అతన్ని బాల్కనీపై నుంచి కిందకు విడిచిపెట్టేందుకు ప్రయత్నించడం ఆయన అభిమానులకు దిగ్భ్రాంతి కలిగించింది. 2003 : ‘లివింగ్‌ విత్‌ మైఖేల్‌ జాక్సన్‌’ అనే బ్రిటీషు డాక్యుమెంటరీనీ ఎబీసీ ఎయిర్స్‌ సంస్థ నిర్మించింది. జాక్సన్‌ ఒక రాత్రి తన పడక గదిలో చిన్న పిల్లలతో గడిపారని, ఆ పిల్లలకూ, జాక్సన్‌కూ గల సంబంధాన్ని అధికారులూ ప్రశ్నించారు. ఇది వివిదాస్పదంగా మారింది. దానిపై జాక్సన్‌ వ్యాఖ్యలతో ‘లివింగ్‌ విత్‌ మైఖేల్‌ జాక్సన్‌’ అనే డాక్యుమెంటరీని తీశారు.2005 : నెవర్లాండ్‌లో 2003 సంవత్సరంలో క్యాన్సర్‌నుంచి కోలుకుంటున్న 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు జాక్సన్‌కు న్యాయమూర్తి శిక్ష విధించారు. 2006 : ఈ కోర్టు కేసులకు సంబంధించి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినప్పుడు కాలిఫోర్నియాలోని నెవర్‌లాండ్‌లో 2600 ఎకరాల్లో ఉన్న తన ఇంటిని మూసివేశారు. ఆ సందర్భంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని తొలగించి వారు కోర్టు కెళ్లకుండా లక్షలాది డాలర్లను వారికి వేతనంగా చెల్లించారు.
గుండెపోటుతోనే మృతిలాస్‌ఏంజెల్స్‌/ వాషింగ్టన్‌ : పాప్‌ సంగీత ప్రపంచపు రాజు మైకేల్‌‌‌ జాక్సన్‌ ఇక లేరు. తన గానంతో, నాట్యంతో ప్రపంచంలో కోట్లాది మంది అభిమానుల్ని ఉర్రూతలూగించిన 50 ఏళ్ల మైకేల్‌ జాక్సన్‌ గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో ఇక్కడి ఒక ఆస్పత్రిలో మరణించారు. ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో ఉన్న మైకేల్‌‌‌ జాక్సన్‌ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలో ఉన్న ఆస్పత్రిలో చేర్చారు. మైకేల్‌‌‌ మరణానికి దారితీసిన పరిస్థితులను గురించి శుక్రవారం కొన్ని వివరాలు మాత్రమే తెలిశాయి. స్పృహ కోల్పోయి, శ్వాస ఆడని పరిస్థితిలో జాక్సన్‌ను ‘ఉక్లా’ మెడికల్‌ సెంటర్‌కు తీసుకొచ్చారు. ‘ఆయనను ఎలాగైనా కాపాడాలని డాక్టర్లు గంటకు పైగా ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి’ అని జాక్సన్‌ సోదరుడు జెరె్మైన్‌ జాక్కన్‌ ఒక రేడియో ప్రసారంలో వెల్లడించారు. గురువారం పొద్దుపోయిన తర్వాత జాక్సన్‌ మృతదేహాన్ని ఆస్పత్రినుంచి హెలికాప్టర్‌లో మరణాలపై పరీక్షలు జరిపే కార్యాలయానికి చేర్చారు.
మరణంపై అభిమానుల అనుమానాలుమైకేల్‌ జాక్సన్‌ మరణించిన ఒక రోజు అనంత రం ఆయన మృతిపై అనుమానాలు కలుగుతున్నాయి. రకరకాల పుకార్లు వ్యాపించాయి. జాక్సన్‌ కుటుంబ ప్రతినిధి బ్రియాన్‌ ఆక్స్‌మాన్‌ సిఎన్‌ఎన్‌ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ మైఖేల్‌ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబం ఎప్పుడూ ఆందోళన చెందుతూండేదని తెలిపారు. ‘జూలైలో ఆయన లండన్‌లో వరసగా 50 ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంది. దానికోసం రిహార్సల్స్‌ చేస్తున్నారు. ఆయన అతి కష్టంగా రిహార్సల్స్‌ చేస్తున్నారు. తనకున్న వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువగా మందులు వాడడం, గతంలో వెన్నెముకకు సంబంధించిన వ్యాధి రావడం, ఒక ప్రదర్శన సమయంలో వేదిక మీది నుంచి కిందపడి కాలు విరగడం కూడా ఆయన మరణానికి దారితీశాయనవచ్చు’ అని ఆక్స్‌మాన్‌ చెప్పారు. జాక్సన్‌ మరణం ఒక మిస్టరీగా తయారు కావడంతో, దాన్ని ఛేదించేం దుకు ఆయన మృతదేహానికి శుక్రవారం పరీక్షలు జరపాలని అధికారులు నిర్ణయించారు. కానీ అందుకు కొన్ని వారాలు పట్టవచ్చు. టాక్సాలజీ పరీక్షల నివేదిక రావడానికి ఆలస్యం అవుతుంది. జాక్సన్‌ ఏవైనా మాదక ద్రవ్యాలు, లేదా మద్యం తీసుకున్నారా, లేక తన వ్యాధుల తీవ్రత తగ్గేందుకు ఎక్కువ మోతాదులో మందులు తీసుకున్నారా అన్నది ఈ పరీక్షల్లో తేలుతుంది. లాస్‌ ఏంజిల్స్‌ సమీపంలో హాంబీ కొండలపై ఉన్న జాక్సన్‌ ఇంటిని ఇక్కడి పోలీస్‌ శాఖకు చెందిన డిటెక్టివ్‌లు సోదా చేశారు.
ఇంట్లోనే మరణించి ఉండవచ్చులాస్‌ ఏంజిల్స్‌ శివారులో ఒక అద్దె ఇంట్లో మైకే ల్‌ జాక్సన్‌ ఉంటున్నారు. జాక్సన్‌కు వచ్చిన ఒక ఫోన్‌కు ఆయన స్పందించకపోతే ఇరుగుపొరుగువారు సమాధానమిచ్చారని అధికారులు తెలిపారు.
ఇంజక్షనే కారణమా?డెమొరాల్‌ అనే నొప్పిని తగ్గించే శక్తివంతమైన ఇంజక్షన్‌ను మోతాదు మించి తీసుకున్నందువల్లే జాక్సన్‌కు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని కొందరు చెబుతున్నారు. ఈ ఇంజక్షన్‌ తీసుకున్న తర్వాత జాక్సన్‌ స్పృహతప్పి కిందపడిపోయారు. శ్వాస ఆగిపోయిందని తెలుస్తోంది. ఒక ఫోన్‌ కాల్‌ రావడంతో ఇరుగుపొరుగువారు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే జాక్సన్‌ నాడి స్తంభించినట్టు భావిస్తున్నారు.
మైఖేల్‌కు ఇంజక్షన్‌ చేసిన డార్టర్‌ అదృశ్యంఎక్కువ మోతాదులో ఇచ్చిన ఇంజక్షన్‌ వల్లే జాక్సన్‌ మరణించి ఉండవచ్చని ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో ఆ డాక్టర్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ డాక్టర్‌ మైఖేల్‌ జాక్సన్‌తో పాటు ఆయన ఇంట్లోనే ఉండేవాడు. రోజూ శక్తివంతమైన డెమొరాల్‌ ఇంజక్షన్‌ చేసేవాడు. ఇది మార్ఫిన్‌ అంతటి బలమైంది. కానీ జాక్సన్‌ మరణించిన తర్వాత డాక్టర్‌ కనిపించకుండా పోయాడు. జాక్సన్‌ మరణానికి ముందే ఆయనకు ఇంజక్షన్‌ చేసిన వ్యక్తి డాక్టర్‌ టోమే టోమే అని లండన్‌ నుంచి వెలువడే ది సన్‌ వార్తా పత్రిక పేర్కొంది. జాక్సన్‌ మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం ఆస్పత్రి నుంచి హెలికాప్టర్‌లో తరలించారు.పోస్ట్‌ మార్టం నిర్వహిస్తున్న డాక్టర్‌ లక్ష్మణన్‌ సత్యవాగీశ్వరన్‌ ఓజే సింప్సన్‌ నిర్విహంచిన శవ పంచనామాకు హాజరయ్యారు. విచారణలో ఈయనే కీలకమని అంటున్నారు.
జాక్సన్‌ మృతితో కుప్పకూలిన టూర్‌ ఆర్గనైజర్లులాస్‌ఏంజెల్స్‌: పాప్‌ ప్రపంచ రారాజు మైకేల్‌ జాక్సన్‌ మరణంతో ఒకవైపు ప్రపంచవ్యాప్త పాప్‌ సంగీత ప్రియులు శోకసముద్రంలో మునిగిపోగా, మరో వైపు ఆయన పునరాగమన సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏఈజీ లైవ్‌ సంస్థ తీవ్రంగా నష్ట పోయింది. జాక్సన్‌ ఐదు పదుల వయసును పురస్కరించుకుని, జులై 13 నుండి లండన్‌లోని ప్రసిద్ధ ఓ-2 ఎరీనాలో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమం కోసం ఏఈజీ దాదాపు 85 మిలియన్ల టికెట్లను అమ్మింది. మైకేల్‌ మరణంతో ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా దాదాప 7.5 లక్షల మంది ప్రజలకు టికెట్‌ డబ్బు వాపసు చేయవలసి వస్తుందని లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. లాస్‌ ఏంజిల్స్‌కు చెందిన ఈ కంపెనీ జాక్సన్‌ కార్యక్రమ ఏర్పాటు కోసం ఇప్పటికే దాదాపు 20 మిలియన్‌ అమెరికా డాలర్లను ఖర్చు చేసింది. 50-ఏళ్ల మైకేల్‌ జాక్సన్‌ డాన్స్‌ చేసే చివరి కార్యక్రమం ఇదే. లక్షల మంది ప్రేక్షకులకు టికెట్‌ డబ్బు వాపసు చేయడం చాలా శ్రమతోను, ఖర్చుతోను కూడుకున్న వ్యవహారం. ఈ కార్యక్రమం కోసం అత్యంత ఖరీదైన, సాంకేతికంగా అత్యాధునికమైన పరిరాలను ఏర్పాటు చేశారు. ఈ ఖర్చుల నేపథ్యంలో, టికెట్లపై బీమా కూడా చేయక పోవడంతో ఏఈజీ సంస్థ ఘోరంగా దెబ్బతినగలదు.
నా గుండె బద్దలైంది : మాజీ భార్య లీసావాషింగ్టన్‌ :
తన మాజీ భర్త మైకేల్‌‌‌ జాక్సన్‌ గుండెపోటుతో మరణించాడని తెలుసుకున్న ఆయన మాజీ భార్య గాయని లీసా మేరీ ప్రీస్లీ తన హృదయం ముక్కలైందని చెప్పారు. 41 ఏళ్ల ఈ గాయని 1994లో పాప్‌స్టార్‌ను వివాహం చేసుకున్నారు. కానీ 20 నెలల తర్వాత ఇద్దరూ విడిపోయారు. ‘నేను దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాను. అంతా అయోమయంగా ఉంది’ అని లీసా చెప్పినట్టు యూఎస్‌ మేగజైన్‌. కాం పేర్కొంది. ‘అతని పిల్లల్ని చూస్టుంటే నా గుండె బద్దలైంది. వాళ్లంటే అతనికి, అతని కుటుంబానికి ప్రాణం. అన్ని విధాలా తీరని నష్టం కలిగింది. నాకు మాటలు రావడం లేదు’ అని ఆమె అన్నారు.

26, జూన్ 2009, శుక్రవారం

ఫ్రెండ్స్ సమ్ ఫాన్నీ

స్టూడెంట్: మొత్తం మీరే చేసారు. ఇంక చాలు సర్, మీరు మాకు ఇచ్చిన టఫ్ కొశ్చిన్ పేపర్స్ ఇంక చాలు! మీ పేపర్స్ వల్ల జీవితంలో చాలా కోల్పోయాము.

ప్రొఫెసర్: నా వల్లా..? యేం కోల్పోయావురా..?

స్టూడెంట్: ఇంకా అర్ధం కాలేదా మీకు? ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి ముందు నాలో ఉండేది, ఇప్పుడు లేనిది, యేంటో తెలుసా…? “పాస్ అవ్వటం”....! చిన్న చిన్న పరీక్షల్లో కూడా ఫెయిల్ అయ్యాను మీ వల్ల.... ఈ కొశ్చిన్ పేపర్స్ మీరే సెట్ చేస్తారు.. ఈ పేపర్ చాలా ఈజీ అని మీరు నన్నే కన్విన్స్ చేస్తారు.. నాకు ఎలా ఉంటుందో తెలుసా "దానిని చింపి విసిరేసి", నాకు ఒక్క ముక్క కూడా రాదు అని అరవాలనిపించేది.. పరీక్ష రాయి అంటారు.. నేను ఏదో రాద్దామని వస్తే.. మీరు నన్ను ఫెయిల్ చెయ్యాలని చూస్తారు.. పేపర్ లో చాయిస్ ఇవ్వరు..
ఏ కొశ్చిన్ కి ఏ ఆన్సర్ రాయాలొ కూడా మీరె చెప్తే ఇంక నేను ఎందుకు సర్ రాయడం..
చివరికి నేను క్లాస్ లో ఎలా కూర్చోవాలో కూడా మీరే చెప్తే, బుర్రకి ఏమి ఎక్కడం లేదు సర్..

కష్టమైన పేపర్ సెట్ చెయ్యటం లో ఉన్న ఆనందం ఏంటో మీకు తెలుసు. కానీ పేపర్ లో చదివిన కొశ్చిన్స్ లేకపొతే కలిగే బాధ ఏంటో మీకు తెలియదు




ఈ అనంతవిశ్వంలోని సమస్తంలో నే విశ్వసించేది ఒక'' నేస్తమునే'', నే విశ్వసించే ఆ నేస్తం నను మరుస్తేనో, మరుజన్మలోనైనా ఆ ''స్నేహం'' అందుతుందని కనులుముస్తాను



నీ అందాన్ని వర్ణించడానికి నా సిరా లో ఇంకు లేదు,కాని నీ మనసుని స్పందింప చేయడానికి నాలో ప్రేమావుంది, ఇంకులేదు కదా అని,నీ అందాన్ని వర్నించనేమో అనుకున్న, కాని నా శరీరంలో వున్న ప్రతి రక్తపు బిందువు వెళ్ళేవరకు నిన్ను నీఅందాన్ని వర్ణిస్తూనే వుంటా.............!


''గులాబిపువ్వును'' చూసి అది అందంగా వుందని ముట్టుకున్నాను, కాని అది ముట్టుకున్న తరువాత గాని తెలియలేదు, దానికి ''ముల్లువుంటై'' అని, ఇప్పుడు నా పరిస్థితి అదే ''అందమైన'' నిన్ను చూసి, నీ ''హృదయం'' కావాలనుకున్నాను, కాని ఆ ''హృదయం'' చుట్టూ ముల్లపోద వుందని నాకు తెలియదు, ''తెలిసినా'' ఆ హృదయమే కావాలంటుంది ''నా హృదయం''


నీవు స్పందించే స్ఫూర్తివి , లాలించే ఒదార్పువి , మురిపించే ఒర్పువి , అందంలో ఆహ్లాదనివి, వుహలరేయిలో మధుర స్వప్నానివి , అందుకే వేచివుంటా నీకోసం................

నిన్ను చేరాలని..........! అలలకు ఎంత ఆరాటం తీరాన్ని చేరాలని, వర్షానికి ఎంత సంతోషం పుడమిని తాకాలని సెలయేరుకి ఎంత సంబరం సముద్రంలో కలవాలని, మొగ్గకు ఎంత మురిపం పువ్వుగా పూయాలని, నా మనసుకి ఎంత ఆరాటం నిన్ను చేరాలని ....




¶¶¶¶¶¶¶
¶¶¶
¶¶¶¶¶¶
¶¶¶¶¶¶ aithful…
¶¶¶
¶¶¶

¶¶¶¶¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶ espectful…
¶¶¶_¶¶¶
¶¶¶__¶¶¶

¶¶¶
¶¶¶
¶¶¶
¶¶¶ ntelligent…
¶¶¶
¶¶¶
¶¶¶

¶¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶¶
¶¶¶
¶¶¶¶¶¶ verlasting or loyal…
¶¶¶
¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶¶¶

¶¶¶__¶¶¶
¶¶¶¶_¶¶¶
¶¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶¶¶ aughty…and
¶¶¶_¶¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶__¶¶¶

¶¶¶¶¶¶
¶¶¶¶¶¶¶¶
¶¶¶__¶¶¶¶
¶¶¶___¶¶¶earest of all…
¶¶¶__¶¶¶¶
¶¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶




´´´´´´´´´´´´´´´´´´´´´´¶¶¶¶¶¶¶¶¶¶¶¶
´´´´´´0¶¶¶0´´´´´´´´ø¶¢´´´´´´´´´´´´ø¶ø
´´´´´¶ø´´´¶¶´´´´o¶1´´´´¶¶¶´´1¶¶¶´´´7¶¢
´´´´´¶1´´´´¶´´´$ø´´´´´´¶¶$´´´¶¶´´´´´´¢¶
´´´´´o¶´´´o¶´´o¶´´´´´´´¶¶o´´´¶¶´´´´´´´øø
´´´´´´¶´´´¶´´´¶´´´´´´´´´´´´´´´´´´´´´´´´ø
´´´´¶¶¶¶¶¶¶¶¶¶¶¶´´´´´´´´´1¶1´´´´´´´´´´´ø¶
´´´¶´´´´´´´´´´´´¶´¶¶´´´´´¶¶¶´´´´´´¶¶´´´´ø
´´ø¶´´´´´´´´´´´o¶´´¶¶´´´´´´´´´´´´¶¶´´´´´ø
´¶¶´´´¶¶¶¶¶¶¶¶¶¶¶´´´7¶¶ø7oo77¢¶¶¶´´´´´´ø¶
´¶´´´´´´´´´´´´´´´¶´´´´´¶¶¶¶¶¶¶´´´´´´´´oø
´¶¢´´´´´´´´´´´´´´¶´´´´´´´´´´´´´´´´´´´¶
´´¶´´´¶¶¶¶¶¶¶¶¶¶¢¶7´´´´´´´´´´´´´´´´7¶ø
´´´¶´´´´´´´´´´´¶´´ø¶¶´´´´´´´´´´´øø¶
´´´´¶¶¶¶¶¶¶¶¶¶¶ø´´´´´´¶¶¶¶¶¶¶¶¶¶´

*.........Friends.............Foreever..*
¨¶¶¶¶¶¶¶¶¶¶¨¶¶¶¶¶¶¶¶¨¨¨¨¨¶¶¶¶¶¶¨¨¨
¨¶¨¨¨¨¨¨¨¨¶¨¶¨¨¨¨¨¨¨¶¨¨¨¶¨¨¨¨¨¨¶¨¨
¨¶¨¨¶¶¶¶¶¶¶¨¶¨¨¶¶¶¶¨¨¶¨¶¨¨¶¶¶¶¨¨¶¨
¨¶¨¨¶¶¶¶¨¨¨¨¶¨¨¶¨¨¶¨¨¶¨¶¨¨¶¶¶¶¶¶¶¨
¨¶¨¨¨¨¨¶¨¨¨¨¶¨¨¶¨¨¶¨¨¶¨¨¶¨¨¨¨¨¨¶¨¨
¨¶¨¨¶¶¶¶¨¨¨¨¶¨¨¶¨¨¶¨¨¶¨¶¶¶¶¶¶¶¨¨¶¨
¨¶¨¨¶¨¨¨¨¨¨¨¶¨¨¶¶¶¶¨¨¶¨¶¨¨¶¶¶¶¨¨¶¨
¨¶¨¨¶¨¨¨¨¨¨¨¶¨¨¨¨¨¨¨¶¨¨¨¶¨¨¨¨¨¨¶¨¨






Life is a challenge......... Meet it
Life is a gift................... Accept it
Life is an adventure ..... Dare it
Life is a sorrow............. Overcome it
Life is a tragedy............ Face it
Life is a duty................. Perform it
Life is a game............... Play it
Life is a mystery........... Unfold it
Life is a song................ Sing it
Life is an opportunity.... Take it
Life is a journey............ Complete it
Life is a promise............ Fulfil it
Life is love..................... Enjoy it
Life is beauty................ Praise it
Life is a spirit................ Realise it
Life is a struggle........... Fight it
Life is a puzzle............. Solve it
Life is a goal................. Achieve it
So enjoj your Life at the most you can

17, జూన్ 2009, బుధవారం



















NEW ది NEW
___ __




___ ___ _____
___ __